విద్యుత్ స్తంభం ఎక్కి.. కరెంట్ షాక్తో చిరుతపులి మృతి
విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ చిరుతపులి కరెంట్షాక్కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ మండల కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి శనివారం ఓ చిరుతపులి.
నిజామాబాద్: విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ చిరుతపులి కరెంట్షాక్కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ మండల కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి శనివారం ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చింది.
స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అంతలోపే చిరుత విద్యుత్ స్తంభం ఎక్కింది. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో కరెంట్షాక్కు గురై తీగలపైనే మృతి చెందింది.

కాగా, నిజామాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ రవిమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ వెటర్నరీ ఆస్పత్రికి చిరుత మృతదేహాన్ని తరలించారు. చిరుత ఊర్లోకి రావడంతో ఒక్కసారిగా జనమంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ విధంగా మృతి చెందడంతో వారంతా బాధను వ్యక్తం చేశారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications