విద్యుత్ స్తంభం ఎక్కి.. కరెంట్ షాక్తో చిరుతపులి మృతి
విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ చిరుతపులి కరెంట్షాక్కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ మండల కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి శనివారం ఓ చిరుతపులి.
నిజామాబాద్: విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ చిరుతపులి కరెంట్షాక్కు గురై మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ మండల కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి శనివారం ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చింది.
స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అంతలోపే చిరుత విద్యుత్ స్తంభం ఎక్కింది. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో కరెంట్షాక్కు గురై తీగలపైనే మృతి చెందింది.

కాగా, నిజామాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ రవిమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ వెటర్నరీ ఆస్పత్రికి చిరుత మృతదేహాన్ని తరలించారు. చిరుత ఊర్లోకి రావడంతో ఒక్కసారిగా జనమంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ విధంగా మృతి చెందడంతో వారంతా బాధను వ్యక్తం చేశారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications