రేవంత్ ఇష్యూలో కొత్త ట్విస్ట్: 'నాకు డబ్బివ్వ చూశారు'
ఖమ్మం: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు అశ్వారాపుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది.
తాటి వెంకటేశ్వర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని తనను కూడా కొందరు ఆ పార్టీ నాయకులు సంప్రదించారని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే తనకు రూ.50 లక్షలు ఇస్తాని చెప్పారని ఆయన ఆరోపించారు.
టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని తనకు చెప్పారన్నారు. తాటి వెంకటేశ్వర్లు గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన తెరాసలో చేరారు.

వైసీపీ నుండి తెరాసలోకి చేరినందువల్ల నీవు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఎవరు అనుమానించరని ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇందులో పలు రకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అతను తొలుత టీడీపీ ఆఫర్కు ఓకే చెప్పారని, అయితే రేవంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన మళ్లీ వెనక్కి తగ్గారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే, తాను డబ్బులు తీసుకునేందుకు ససేమీరా అన్నానని తాటి చెప్పారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications