రేవంత్ ఇష్యూలో కొత్త ట్విస్ట్: 'నాకు డబ్బివ్వ చూశారు'
ఖమ్మం: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు అశ్వారాపుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది.
తాటి వెంకటేశ్వర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని తనను కూడా కొందరు ఆ పార్టీ నాయకులు సంప్రదించారని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే తనకు రూ.50 లక్షలు ఇస్తాని చెప్పారని ఆయన ఆరోపించారు.
టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని తనకు చెప్పారన్నారు. తాటి వెంకటేశ్వర్లు గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన తెరాసలో చేరారు.

వైసీపీ నుండి తెరాసలోకి చేరినందువల్ల నీవు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఎవరు అనుమానించరని ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇందులో పలు రకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అతను తొలుత టీడీపీ ఆఫర్కు ఓకే చెప్పారని, అయితే రేవంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన మళ్లీ వెనక్కి తగ్గారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే, తాను డబ్బులు తీసుకునేందుకు ససేమీరా అన్నానని తాటి చెప్పారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications