ఒక్కరోజు ప్రసారాలు బంద్.. కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోల ఆందోళన బాట
హైదరాబాద్ : ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోలు. ఈమేరకు ఒకరోజు ప్రసారాలు నిలిపివేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈనెల 27న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనకు రెడీ అయ్యారు.
రెండు రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోలు ఏకతాటిపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనలు తమకు భారంగా మారునున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఛానల్ కు 19 రూపాయల భారం పడనుందని అంటున్నారు.

వినియోగదారుల ఇష్టం మేరకు ప్రసారాలు అందించాలనేది ట్రాయ్ కొత్త నిబంధన. దీంతో కేబుల్ ద్వారా ప్రసారమవుతున్న ఛానళ్లు.. ఈనెల 29 నుంచి నిలిచిపోనున్నాయి. కేబుల్ కనెక్షన్ ద్వారా వినియోగదారుడు ఏయే ఛానళ్లు కోరుకుంటున్నారో.. ఆమేరకు ప్యాకేజీల వారీగా ప్రసారాలు పొందే వీలుంది.












Click it and Unblock the Notifications