రామోజీరావుకు అస్వస్థత: యశోదాలో చికిత్స
రామోజీ గ్రూప్, ‘ఈనాడు’ సంస్థల అధిపతి రామోజీరావు అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్: రామోజీ గ్రూప్, 'ఈనాడు' సంస్థల అధిపతి రామోజీరావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం నుంచి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్వీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీతసాగర్ రెడ్డిల బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం స్వల్పంగా ఆహారం కూడా తీసుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
వెన్నునొప్పు, వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఏమ్వీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్సాగర్ బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రివర్గాలు పేర్కొన్నాయి.
Comments
English summary
Ramoji groups head Ramoji Rao on Monday fell ill and joined Yashoda hospital in Hyderabad.