భార్య చనిపోయిందని చేరదీస్తే ...వదినపై అత్యాచారం చేయబోయాడు
అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే ప్రయత్నించాడు. చేరదీసిన అన్న కుటుంబాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించాడు భార్య చనిపోయిందని తమ్ముడిని తన ఇంటివద్దే పెట్టుకొన్నాడు.
హైదరాబాద్ : ఎవరూ లేరని చేరదీసిన విషయాన్ని కూడ మరిచాడు. అన్నం పెట్టినవారికే సున్నం పెట్టే ప్రయత్నం చేశాడు. భార్య చనిపోయిందని చేరదీసిన అన్న కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు. తల్లి లాంటి వదినపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
సికింద్రాబాద్ లోని అడ్డగుట్టలో అన్నదమ్ములు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అనారోగ్యంతో తమ్ముడి భార్య చనిపోయింది. ఎవరూ లేని కారణంా తమ్ముడిని తన ఇంటి వద్దనే పెట్టుకొన్నాడు అన్న.

ఎవరూ లేదని ఆదరించిన అన్న కుటుంబానికి ఎసరు పెట్టాడు తమ్ముడు.ఒంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొన్నాడు. నిద్రిస్తున్న వదినకు కత్తి చూపి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు మరిది.
ఈ హఠాత్ పరిణామానికి షాక్ గురైన ఆమె భయంతో కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు రావడంతో మరిది పారిపోయాడు. చేరదీసి అన్నం పెట్టిన పాపానికి గాను వదినపై అత్యాచారానికి ప్రయత్నించిన మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications