హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం..!!
హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కలకలంగా మారింది. సికింద్రాబాద్-మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయా లయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించడంతో తప్పిం చుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్గా పని చేస్తున్న ఓ యువతి (23) ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.

ఆ యువతి తన సెల్ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చింది. ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు మహిళల కోచ్ లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలో ప్రయాణిస్తు న్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. అనంతరం ఆ కోచ్లో ఆమె ఒక్కరే మిగిలిపోయారు. ఇది గమనించిన ఓ యువకుడు (25) ఆమె వద్దకు వచ్చి అత్యాచా రయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువతి నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది.
కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కింద పడి, గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వటం తో ప్రథమ చికిత్స అందించి ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications