రాహుల్ గాంధీకి ఏబీవీపీ షాక్: రాజయ్య ఇంట్లో ముగ్గురు చనిపోతే రాలేదే'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భాగ్యనగరం చేరుకున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్సియుకు వెళ్తున్న సమయంలో ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు దానం నాగేందర్, షబ్బీర్ అలీ, జానా రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం హెచ్సియుకు బయలుదేరారు.

'రాజయ్య ఇంట్లో ముగ్గురు చనిపోతే రాలేదేం'
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాక పైన బిజెపి, ఏబీవీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్క్రృతులైన మాజీ ఎంపీ రాజయ్య నివాసంలో ముగ్గురు చనిపోతే ఎందుకు రాలేదని బిజెపి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు రావడం రాజకీయ కోణమేనని విమర్శించారు.
విశ్వవిద్యాలయంలో గతంలో కూడా 35 మందిని సస్పెండ్ చేశారని, అప్పుడు కూడా కేంద్రం దానికి కారణమని తాము భావించలేదన్నారు. అలాగే ఇప్పుడు అయిదుగురిని సస్పెండ్ చేశారన్నారు. యూకుబ్ మెమెన్ ఉరితో వివాదం మొదలైందన్నారు. ఫేస్బుక్లో మెమెన్కు అనుకూల కామెంట్లు పెట్టాడాన్ని ఏబీవీపీ నాయకులు ప్రశ్నిస్తే వారిని చితక్కొట్టారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసం తెరాస ప్రయత్నిస్తోందన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications