రూ.8 లక్షలు తీసుకొని, పెళ్లి చేసుకుంటానని మోసం: సాఫ్టువేర్ కంపెనీ సీఈవో అరెస్ట్
హైదరాబాద్: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమె దగ్గర నుంచి రూ.8 లక్షలు తీసుకొని మోసం చేసిన ఓ సాఫ్టువేర్ కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడిని రిమాండుకు తరలించారు.
మాదాపూర్ డాక్టర్స్ కాలనీలో ఉండే హేమంత్ కుమార్ అనే ముప్పై ఏళ్ల యువకుడు అయ్యప్ప సొసైటీ రోడ్డులో ఉన్న ఓ ఐటీ కంపెనీ సీఈవో. అదే కంపెనీలో ఖమ్మంకు చెందిన యువతి సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తోంది.

పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెను నమ్మించాడు. దాదాపు రెండేళ్ల క్రితం అంటే 2016 మార్చిలో అతను రూ.8 లక్షల నగదును ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె డబ్బు తిరిగి ఇవ్వలేదు.
ఆమె అడిగితే తప్పించుకు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల ఆమె మరోసారి అతనిని డబ్బుల గురించి, పెళ్లి గురించి నిలదీసింది. దీంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధితురాలు ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేయగా, మంగళవారం అతనిని అరెస్టు చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications