ఆ సమయంలో ఎండలో నిలుచుకున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్పై కోర్టుకు?
తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య శాసనసభ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య శాసనసభ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో సభ నుంచి బహిష్కరణకు గురైన వీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఎండలోనే నిలబడి తమ నిరసన తెలిపారు.
బడ్జెట్ ప్రసంగం గంటకు పైగా సాగింది. సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు లేనప్పటికీ తాము గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామనే నెపంతో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో తమ గొంతు నొక్కడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల ఎదుట నిరసన తెలపాలని టిడిపి నిర్ణయించింది. ఖమ్మంలో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
ఇదిలా ఉండగా, గురువారం గవర్నర్ నరసింహన్ను కలిసి సస్పెన్షన్ అంశాన్ని ఆయనకు వివరించాలని నిర్ణయించారు. మరోవైపు, తమ సస్పెన్షన్ పైన రేవంత్ రెడ్డి, సండ్రలు హైకోర్టుకు వెళ్లే విషయమై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications