గదికి తీసుకొచ్చి బ్యూటీషియన్పై గ్యాంగ్రేప్కు యత్నం: నిందితుల్లో ఎమ్మెల్సీ కుమారుడు
నగర శివార్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్కు చెందిన ఓ బ్యూటీషియన్పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి యత్నించారు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్: నగర శివార్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్కు చెందిన ఓ బ్యూటీషియన్పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి యత్నించారు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
యువతి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితులు ప్రీతంరెడ్డి, అరవరెడ్డిపై కేసులు నమోదు చేశారు. కాగా, ముగ్గురు నిందితుల్లో ఒకరు.. ఓ ఎమ్మెల్సీ కుమారుడు కావడం గమనార్హం.

బాధితురాలు ఫిర్యాదు మేరకు ఘటన వివరాలిలా ఉన్నాయి... కొంపల్లిలోని ఫాంమెడోస్లో నివసించే ప్రీతంరెడ్డి (26)కి బంజారాహిల్స్లో బ్యూటీషియన్గా పనిచేసే బాధిత యువతి(23) ఇటీవల ఓ పబ్లో పరిచయమైంది. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని పలుమార్లు సందేశాలు పంపాడు. ఆ తర్వాత ఆమెతో ఫోన్ సంభాషణ మొదలెట్టాడు.
కాగా, మే 5వ తేదీన ఇంట్లో ఎవరూలేరని ఇంటికి రావాలని ఆ యువతిని కోరాడు. పదేపదే ఫోన్ చేశాడు. దీంతో మే 6న మధ్యాహ్నం కారులో తన గదికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడు. అనంతరం గదిలో పెట్టి తన ఇరువురు స్నేహితులను తీసుకువచ్చి వారి కోరికను తీర్చాలని బలవంతపెట్టాడు. ముగ్గురు కలిసి యువతిని కారులో ఎక్కించుకుని దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు.
తన వద్ద డబ్బు లేకపోవడంతో లేకపోవడంతో జిమ్లోని ఓ యువతి వద్ద రూ.400 తీసుకుని బాధిత యువతి ఆటోలో ఇంటికి వెళ్లింది. అనంతరం జరిగిన ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం సాయంత్రం ఫాంమెడోస్లోని సంఘటనా స్థలాన్ని క్రైం డీసీపీ జానకీషర్మిల, పేట్బషీరాబాద్ ఏసీపీ అందె శ్రీనివాసరావు పరిశీలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications