భిక్షాటన చేయనందుకు మూడేళ్ళ చిన్నారికి చిత్రహింసలు, సోషల్ మీడియాలో పోస్టు
బిక్ఠాటన చేయని బూడేళ్ళబాలుడిని చిత్రహింసలు పెడుతున్న ఫోటో సామాజిక మాథ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో కి వచ్చింది. ఈ ఫోటో ఆధారంగా బాలలహాక్కుల సంఘం డిజిపికి ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ :బిక్షాటన చేయాాలని కోరుతూ బాలుడిని చిత్రహింసలు పెట్టిన చిత్రాలు సామాజిక మాథ్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. చిన్న పిల్లాడు అని చూడకుండా బిక్షాటన చేసేందుకు కొందరు ఈ రకంగా వేధించారని సామాజిక మాథ్యమంలో పోస్టులు ప్రచారంలో ఉన్నాయి. ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది.
బిక్షాటన చేయాలని ఒంటిపై దుస్తులు లేకుండా మూడేళ్ళ పిల్లాడిని స్థంబానికి కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఫోటోలు సామాజిక మాథ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.ఈ ఘటన హైద్రాబాద్ లో జరిగిందని ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన మర్రిపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి పోస్టు పెట్టాడు.
మూడేళ్ళ పిల్లాడు బిక్షాటన చేసేందుకు నిరాకరించిన కారణంగానే కొందరు ఈ రకంగానే ఆయనను స్థంానికి కట్టేసి చిత్రహింసలు పెట్టారని ఈ పోస్టులో శ్రీనివాసులు వివరించారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన వస్తోంది.
ఈ పోస్టుకు 7,100 లైకులు, 3,900 కామెంట్లు, 49 వేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం డిజిపికి ఫిర్యాదు చేసింది.బాలుడిని చిత్రహింసలు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.ఈ ఘటన ఎక్కడ జరిగింది. మూడేళ్ళ బాలుడిని ఎవరు చిత్రహింసలకు గురించేశారనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.