జగన్, చంద్రబాబు ప్రభుత్వాలకు తేడా లేదు... బీజేపీ
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి గత టీడీపీ ప్రభుత్వ పాలనకు తేడా లేదని బీజేపీ నేతలు విమర్శించారు. దీంతో వైసీపీ ప్రభుత్వాన్ని భవిష్యత్ ఎలా భరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనాచౌదరీతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై బీజేపీ మరోసారి ధ్వజమెత్తింది. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు తేడా లేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పాలనపై నివేదికను విడుదల చేశారు. ఈనేపథ్యంలనే కేంద్రం నుండి నిధులు రాబట్టడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు.

ఇక వైకాపా ప్రభుత్వం తమ కార్యకర్తలతో పాటు అనుకూలురకే ఉద్యోగాలను ఇస్తోందని కన్నా లక్ష్మి నారయణ ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే...వారిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అమరావతి నిర్మాణాలను ఆరునెలల పాటు నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభించామని చెబుతుందని వారు విమర్శించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పై కూడ కేంద్రానికి నిజాలు చెప్పడం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications