నాలుగు రోజులు, రెండు అల్ప పీడనాలు.. దక్షిణాది రాష్ట్రాలపై ఎఫెక్ట్
విశాఖపట్నం : నాలుగు రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలకు అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గురువారం (డిసెంబర్ 6) ఒక అల్పపీడనం ఏర్పడేలా ఛాన్సుందని చెప్పారు. మరొకటి ఈనెల 9న ( ఆదివారం) ఏర్పడొచ్చని వివరించారు. ఈ రెండు అల్పపీడనాల కారణంగా దక్షిణాది రాష్ట్రాల తీరాలపై రానున్న 3 రోజులు ఎఫెక్ట్ ఉంటుందన్నారు.
బలమైన గాలులు కూడా వీచే ఛాన్సుందని తెలిపారు. తీరప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. గురువారం, శుక్రవారం.. ఈ రెండు రోజుల్లోనూ రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందన్నారు.













Click it and Unblock the Notifications