ఇండియానాపొలిస్లో దీపావళి వేడుకలు
ఇండియాపోలిస్: అమెరికాలోని ఇండియానాపోలిస్ ఫాల్ క్రీక్ మిడిల్ స్కూల్లో నవంబరు 3 వ తేదీ శనివారం "గీతా దీపావళి వేడుకలు" ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉండే 500 మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. యువతీయువకులు, మహిళలు, పెద్దలు, పిల్లలు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
రెండు వందలమంది స్థానిక తెలుగు పిల్లలతో, తెలుగు సాంప్రదాయ, జానపద పాటల నృత్య ప్రదర్శన విశేషంగా అలరించింది. గీతా "దీపావళి వెలుగులు" కన్నుల పండుగ చేసాయి. గీతా వారు, ఘుమ ఘుమలాడే , సాంప్రదాయ విందు భోజనం వడ్డించారు. మిమిక్రీ రమేష్ మిమిక్రీ తో ప్రేక్షకులను మైమరపింఛి, కడుపుబ్బా నవ్వించారు. తన హాస్యపుజల్లులతో , దీపావళి తారజువ్వాలను వెలిగించాడు.
గాయకుడు పార్థు, గాయని శారద అకునురి పాటలతో గానామృతం పంచారు. అందాల గాయని "సుమంగళి" ప్రత్యేక పాటలతో ప్రేక్షకులను ఆకర్షించింది. సాంప్రదాయ నృత్యం, పాత పాటలు ," తెలుసా మానస" పాట ,హిందీ పాటలు , "ఫాషన్ షో తో తెలుగు సంగీతం", డాన్స్ మెలోడీ తో హిందీ పాటలు, మాధురి దీక్షిత్- హిట్ సాంగ్స్ , "రచ్చ" సినిమా లో పాటకు డాన్స్, "ఫాషన్ షో తో హిందీ సంగీతం", డాన్స్ మెలోడీ తో తెలుగు ఫిలిం సాంగ్స్ , తాజా "టాలీవుడ్ హిట్ సాంగ్స్", కరీనా కపూర్ సాంగ్స్ మెలోడీ, హిందీ ప్రైవేటు ఆల్బం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
చివరగా గీతా అద్యక్షుడు రాము చింతల , శేఖర్ క్రిష్ణమనేని , రాజు చింతల దాతలకు, పోషక దాతలకు, విచ్చేసిన అతిథులకు, కళాకారులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి, ప్రేక్షకులకు, కార్యకర్తలకు, యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేశారు.