ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు, ఎందుకంటే?
గల్ఫ్ దేశాల్లో నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు భారతీయులకు యూఏఈ ఉరిశిక్ష అమలు చేసింది. యూఏఈలో హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సమాచారాన్ని వారి కుటుంబాలకు తెలియజేసింది.
మరణశిక్షకు గురైనవారిని మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్గా గుర్తించారు. వీరిద్దరూ కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారే. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్ రినాష్ దోషిగా తేలాడు. ఇక, ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధరన్ దోషిగా తేలడంతో వీరికి ఉరిశిక్షలు అమలు చేశారు.

అయితే, వీరిద్దరికి అవసరమైన దౌత్య సహాయం అందజేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇది ఇలావుండగా, ఇటీవలే యూఏఈ జైల్లో భారతీయ మహిళ షెహజాది ఖాన్కు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయం కూడా రెండు రోజుల క్రితమే వెల్లడైంది.
ఓ హత్య కేసులో షెహజాదికి అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దాదాపు ఏడాదిపాటు ఆమె న్యాయపోరాటం చేసిన ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 15వ తేదీనే సెహజాదిని ఉరితీశారు. అయితే, ఆ విషయాన్ని
మాత్రం చాలా ఆలస్యంగా రెండు రోజుల క్రితం చేరవేశారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications