పాకిస్థానీల మనసు దోచుకున్న ఇండియా క్రికెటర్ ఇతనే!
2025 సంవత్సరం భారత క్రికెట్ ప్రపంచంలో కొత్త తారల ఆవిర్భావాన్ని సూచించింది. ఈ యువ ప్రతిభావంతులు ఇండియాలోనే కాకుండా క్రికెట్ వైరం తీవ్రంగా ఉండే పాకిస్థాన్లోనూ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించారు. ఈ ఏడాది భారత్, పాకిస్థాన్లు ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ ఫైనల్తో సహా మొత్తం నాలుగు మ్యాచ్లలో తలపడగా అన్నింటిలోనూ భారత జట్టు విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
పాకిస్థాన్లో టాప్ సెర్చ్డ్ అథ్లెట్: అభిషేక్ శర్మ (25)
ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ 2025లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. 25 ఏళ్ల అభిషేక్ శర్మ టోర్నమెంట్లో 44.85 సగటు, 200 స్ట్రైక్ రేట్తో అత్యధికంగా 314 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్లలో అభిషేక్ శర్మ ప్రదర్శన అద్భుతం. ఒక మ్యాచ్లో 13 బంతుల్లో 31 పరుగులు చేయగా.. మరొక మ్యాచ్లో కేవలం 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి పాకిస్థాన్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అభిషేక్ బ్యాటింగ్ తీరు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులలో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తించింది. దీని ఫలితంగా, 2025లో గూగుల్లో పాకిస్థాన్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన అథ్లెట్గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఆశ్చర్యకరంగా టాప్-5లో ఉన్న ఏకైక నాన్-పాకిస్థానీ క్రీడాకారుడు అభిషేక్ మాత్రమే కావడం విశేషం.

పాకిస్థాన్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన అథ్లెట్లు (2025)
1. అభిషేక్ శర్మ (భారత క్రికెటర్)
2. హసన్ నవాజ్ (పాకిస్థాన్ క్రికెటర్)
3. ఇర్ఫాన్ ఖాన్ నియాజీ (పాకిస్థాన్ క్రికెటర్)
4. సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్ క్రికెటర్)
5. ముహమ్మద్ అబ్బాస్ (పాకిస్థాన్ క్రికెటర్)
ఇండియాలో టాప్: 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం
ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన క్రికెటర్ల జాబితాలో అభిషేక్ శర్మ మూడో స్థానంలో నిలవగా.. ఓ యువ సంచలనం అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయస్సు ఉన్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఈ జాబితాలో టాప్-1 స్థానాన్ని దక్కించుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసి, గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇండియన్ అండర్-19, ఇండియా-ఎ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 ప్రముఖులలో ఎక్కువమంది క్రికెటర్లే ఉన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్, ఇతర యువ ఐపీఎల్ సంచలనాలు (ప్రియాన్ష్ ఆర్య, షేక్ రషీద్, ఆయుష్ మ్హాత్రే) ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచారు.
భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ప్రముఖులు (2025)
1. వైభవ్ సూర్యవంశీ
2. ప్రియాన్ష్ ఆర్య
3. అభిషేక్ శర్మ
4. షేక్ రషీద్
5. జెమీమా రోడ్రిగ్స్
6. ఆయుష్ మ్హాత్రే
7. స్మృతి మంధాన
8. కరుణ్ నాయర్
9. ఉర్విల్ పటేల్
10. విఘ్నేష్ పుత్తూరు
ఈ నివేదిక 2025 సంవత్సరంలో భారతదేశంలో క్రికెట్కు ఉన్న ప్రజాదరణ, కొత్త తరం క్రీడాకారులు ఎంత వేగంగా అభిమానులను ఆకర్షిస్తున్నారో తెలియజేస్తుంది.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications