అంధ్రపై జయవీరంగం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Thursday, July 22 2004
చెన్నై:హైదరాబాద్: నక్సలైట్లపై ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడంపైతమిళనాడు ముఖ్యమంత్రి జయలలితఆందోళన వ్యక్తం చేశారు. ఇది బాధ్యతాయుతమైనప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయంకాదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయుధాలు విడనాడుతామని,శాంతి భద్రతలకుఅ విఘాతం కలిగించబోమనినక్సలైట్లు హామీ ఇవ్వకుండా వారికి స్వేచ్ఛకల్పించడం అనుచితమని ఆమె అన్నారు.
తానుఏటా హైదరాబాద్ వెళ్తుంటానని, నక్సలైట్లపైనిషేధం లేకపోవడం వల్ల తనభద్రతకు ముప్పు ఏర్పడవచ్చని ఆమెఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను,ప్రజల జీవితాలను ఫణంగా పెట్టి పీపుల్స్వార్పైనిషేధం ఎత్తేయడం ప్రమాదకరమనిఆమె అన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులుపెట్టడం సురక్షితం కాదని వెనక్కిపోతారని ఆమె అన్నారు.
ఎల్టిటిఇనుంచి ప్రాణభయం ఉన్న జయలలితకు చాలాకాలంగాజెడ్ప్లస్ సెక్యూరిటీ ఉంది. టైగర్లకునక్సలైట్లకు సంబంధాలు ఉన్నాయనివార్తలు రావడంతో జయలలిత ఇప్పుడుహైదరాబాద్ రావడానికి భయపడుతున్నారు.
ముస్లింలకుఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కూడాఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మైనారిటీల్లోముస్లింలు ఒక విభాగం మాత్రమేనని,ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంసముచితం కాదని ఆమె అన్నారు.
Recent Stories
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
