ఐసిస్ 'కిల్ లిస్ట్'లో భారత టెక్కీలు, అందుకే టార్గెట్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ 'కిల్ లిస్ట్'ను విడుదల చేసింది. నాలుగు వేల మంది కిల్ లిస్ట్లో 285 మంది భారతీయులు ఉన్నారు. వారిలో సాఫ్టువేర్ ఇంజినీర్లు కూడా ఉన్నారు. భారత ప్రభుత్వానికి అండగా ఉంటున్న టెక్కీలను వారు టార్గెట్గా పెట్టుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల మందిని చంపనున్నట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ సైబర్ యాక్టివిటీస్ సంస్థ ఖలీఫత్ సైబర్ ఆర్మీ ద్వారా ప్రకటించింది. ఇందులో సగానికి పైగా అమెరికన్లతో కూడిన జాబితా ఉంది. యూకే, ఫ్రాన్స్, కెనడాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.

వీరినందరినీ వెంటనే అంతమొందించాలని ఐసిస్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి ఫాలోవర్స్కు పిలుపునిచ్చిందిత. ఐసిస్ విడుదల చేసిన జాబితాలో చంపాల్సిన వారి చిరునామాలతో పాటు ఈ మెయిల్ ఐడీలు కూడా ఉన్నాయి. 285 మంది భారతీయుల పేర్లలో దేశానికి ఐసిస్ నుంచి రక్షణ కల్పిస్తున్న సాఫ్టువేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారు.












Click it and Unblock the Notifications