జాతీయ దుమారం: కెసిఆర్ వర్సెస్ రాధాకృష్ణ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ పోరును ముమ్మరం చేసినట్లు కనిపిస్తున్నారు. వరంగల్ కాళోజీ శత జయంతి కార్యక్రమంలో కెసిఆర్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల నిలిపివేతతో తమకు సంబంధం లేదంటూనే కెసిఆర్ మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాదులో మీడియా ప్రతినిధుల ఆందోళనలతోనూ జాతీయ మీడియా సంస్థల చర్చలతోనూ వాతావరణం వేడెక్కింది.
టైమ్స్ నౌ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధాకృష్ణ కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ తనయుడు కెటి రామారావు సెటిల్మెంట్లను బయటపెట్టినందుకే తమపై కెసిఆర్ కక్ష గట్టారని ఆయన ఆరోపించారు. కాగా, టైమ్స్ నౌ బుధవారం రాత్రి ఓ చర్చా గోష్టిని కూడా నిర్వహించింది. ఈ చర్చా గోష్టిని నిర్వహించిన అర్ణబ్ కెసిఆర్పై తీవ్రంగా దుయ్యబట్టారు. హిట్లర్ సిఎం అంటూ, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా... స్ట్రీట్ గ్యాంగ్ను నడుపుతున్నారా అంటూ ఆయన దుమ్మెత్తిపోశారు.
టీవీ9 చేసిన వ్యాఖ్యలనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తావిస్తున్నారు తప్ప తాము చేసిన తప్పేమిటో చెప్పడం లేదని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అంటున్నారు. 21 శతాబ్దపు హిట్లర్ ముఖ్యమంత్రి అంటూ కెసిఆర్పై టైమ్స్ నౌ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. కెసిఆర్ది హంతక భాష అని వ్యాఖ్యానించింది.

ఎన్టీడిటీవి కూడా ప్రత్యేకంగా చర్చా గోష్టి నిర్వహించింది. ఈ చర్చా గోష్టిలో రాధాకృష్ణ, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కవిత తన తండ్రి కెసిఆర్ వ్యాఖ్యలను సమర్థించారు. కుల్దీప్ నయ్యర్, వినోద్ మెహతా, వెంకట్ నారాయణ, రాజ్దీప్ సర్దేశాయి వంటి ప్రముఖులు కెసిఆర్ తీరును తప్పు పట్టారు.
మరోవైపు, తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా మీడియాపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని రాజకీయ దాడిని పెంచాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు, బిజెపి నాయకులు కెసిఆర్ మీడియా పట్ల అనుసరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. కెసిఆర్పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా రాజకీయ నాయకులు మీడియా జగడంపై ప్రతిస్పందించాల్సిన స్థితిలో పడ్డారు. ప్రస్తుత వివాదాన్ని కెసిఆర్ వర్సెస్ మీడియాగా ముందుకు తేవడానికి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రయత్నిస్తుండగా, తెలంగాణ వర్సెస్ మీడియాగా కెసిఆర్ ముందుకు తెస్తున్నారు.
మీడియా నిష్పక్షపాతంగా ఏమీ లేదనే విషయం మేధావులే కాదు, సాధారణ ప్రజలు కూడా గుర్తించారు. ఈ స్థితిలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, కెసిఆర్కు మధ్య తలెత్తిన సమరం ఎంత దూరం పోతుందనే విషయంపై మాత్రం ప్రజల్లో నెలకొని ఉంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications