పవన్ కల్యాణ్ సంకేతాలు: పొత్తుకు లెఫ్ట్ ఉవ్విళ్లు?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ బిజెపిపై నిప్పులు చెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వామపక్షాలు ఆయన వైపు ఆశగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నాయకులు పవన్ కల్యాణ్ విషయంపై స్పందించారు.
వామపక్షాల పట్ల పవన్ కల్యాణ్ సానుకూల వైఖరి ప్రదర్శించారు. దాంతో వామపక్షాలు ఆయనతో కలిసి ఫ్రంట్ కట్టే ఆలోచన చేయవచ్చునని అంటున్నారు. ఇప్పటికే సినీ హీరో శివాజీ సిపిఐతో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ బంద్ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్రంపై విరుచుకుపడ్డారు. విభాజిత ఏపీకి ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లు హోదా ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారని గుర్తు చేశారు.
ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్షాలతో కలిసి పనిచేయాలనుకోవడం మంచి పరిణామమన్నారు. పవన్ కల్యాణ్ తమ పార్టీతో కలిసి పనిచేయడంపై రాష్టక్రమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ప్రత్యేకహోదా ఇవ్వడం ఇష్టం లేకనే కేంద్ర ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న వారు ప్యాకేజీ కావాలని ముందుగానే కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
జనసేన అధ్యక్షుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని, ఆ రెండు పార్టీలను బలపరిచినందుకు పవన్ తన తప్పుని ఒప్పుకొని ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేదనే విధంగా పవన్ వ్యవహారశైలి ప్రజలకు నచ్చదన్నారు. మహిళ రిజర్వేషన్లపై ఢిల్లీలో జరిగిన సదస్సు అనంతరం వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు.
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు










Click it and Unblock the Notifications