తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగనున్న మహాసంప్రోక్షణంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 3-4 గంటల పాటు రెండు విడతలుగా దర్శనం కల్పించాలా? అని యోచిస్తున్నట్లు తెలిపారు. టీటీడీకి భక్తుల ప్రయోజనాలే ముఖ్యమని.. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది కలిగించేలా ఉంటే మార్చుకునేందుకు వెనుకాడబోమమని ఈవో తెలిపారు. భక్తుల అభిప్రాయాలను బట్టి 24న నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.