టాలీవుడ్ హీరోయిన్ 'స్టూడియో సెలూన్': ప్రారంభించిన సుమ (ఫోటోలు)
చిరకాల మిత్రులు పవన్, విజిత్ వర్మలతో కలిసి మేకోవర్ స్టూడియో సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మనాలి రాథోడ్ అన్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ లో హీరోయిన్ గా సుపరిచితమైన మనాలి రాథోడ్ ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సినిమా-బిజినెస్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేలా ఆమె తన కెరీర్ ను రూపొందించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె 'సెలూన్'రంగంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితులతో కలిసి కూకట్ పల్లిలో మేకోవర్ స్టూడియో సెలూన్ ను ఆమె ఏర్పాటు చేశారు. గురువారం నాడు ఈ స్టూడియో సెలూన్ ప్రారంభోత్సవం జరగ్గా.. ముఖ్య అతిథిగా పాపులర్ యాంకర్ సుమ విచ్చేశారు. మరిన్ని విశేషాలు కింది వివరాల్లో చూద్దాం..
పవన్, విజిత్ వర్మలతో కలిసి:
తన సన్నిహితులైన పవన్, విజిత్ వర్మలతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని హీరోయిన్ మనాలి రాథోడ్ అన్నారు. కాగా, తెలుగమ్మాయిగా సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్న మనాలి.. వ్యాపార రంగంలోను రాణించాలనుకుంటున్నారు.
కూకట్పల్లిలో ' స్టూడియో సెలూన్':
కూకట్ పల్లిలోని భవ్యాస్ తులసీవనం క్లబ్ హౌజ్ లో ఈ మేకోవర్ స్టూడియె సెలూన్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు.. హీరోయిన్ మనాలి రాథోడ్ వ్యాపార రంగంలోను రాణించాలని ఆకాంక్షించారు.
సుమ, పలువురు ప్రముఖులు:
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాపులర్ యాంకర్ సుమ విచ్చేశారు. ఆమె చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన అనంతరం ప్రముఖులు మాట్లాడారు. ప్రత్యేక అతిథులుగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్, ప్రముఖ దర్శకులు మధుర శ్రీధర్, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.
సంతోషం వ్యక్తం చేసిన మనాలి రాథోడ్:
చిరకాల మిత్రులు పవన్, విజిత్ వర్మలతో కలిసి మేకోవర్ స్టూడియో సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మనాలి రాథోడ్ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యాంకర్ సుమకు అభినందనలు తెలిపారు. ఫక్తు కమర్షియల్ ధోరణితో కాకుండా పలువురు అనాథ బాలలకు సైతం ప్రతీ నెలా ఫ్రీ మేకోవర్ చేస్తామని మనాలి రాథోడ్ ప్రకటించారు.