ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!

రెండేళ్ల కూటమి సర్కార్ పాలనలో ఏపీ ఆర్ధిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో గత రెండేళ్లలో రాష్ట్రాన్ని ఆర్దికంగా నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఆయన టార్గెట్ చేశారు. 2019-24 మధ్య ప్రజలు భయంతో, రాష్ట్రంలో విధ్వంసంతో జీవనం గడిపారని, 2024లో ఎన్డీఏ విజయం ఊహించని విప్లవం. అధికారంలోకి వచ్చాక 7 శ్వేత పత్రాలు ఇచ్చామని తెలిపారు.రెండేళ్ల పాలన తర్వాత వివిధ అంశాల్లో ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇంధనశాఖ, అమరావతి, జలవనరులు తదితర అంశాలపై ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చామని, వీటికి కొనసాగింపుగా ఇవాళ ఆర్ధిక పరిస్థితిపై నివేదిక విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Advertisement
Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!
Advertisement

ఒక ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం విమానాశ్రయం ఓ ఉదాహరణ అని చంద్రబాబు తెలిపారు.
అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏపీకి గేట్ వే అని, డేటా సెంటర్లు, ఐటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, స్టీల్ పరిశ్రమలతో ఓ గ్రోత్ ఇంజన్‌గా మారుతోందని తెలిపారు. 2014లో విభజన తర్వాత ఏపీ పరిస్థితి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిందని, 58 శాతం మంది జనాభా ఉంటే 46 శాతమే వనరులు ఉన్నాయని, రాజధాని లేదని, ఆస్తుల పంపకం కూడా సవ్యంగా జరగలేదని గుర్తుచేశారు. 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ఆర్ధికంగా నష్టపోయామని, వ్యవస్థలు కుప్పకూలాయని, శాంతిభద్రతలు లేవని, ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, పరిశ్రమలు పారిపోయాయని వైసీపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

Advertisement

డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్..! ఛార్జీల మాఫీ, వడ్డీ రేటు తగ్గింపు..!

2024లో కూటమి అధికారంలోకి వస్తూనే ఏపీ బ్రాండ్ పునరుద్ధరించామన్నారు. సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని, ప్రాంతీయ సమతుల్యతను కాపాడామన్నారు. రాజధానితో పాటు పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పునర్నిర్మాణం చేపట్టామన్నారు. ప్రగతిశీల విధానాలతో పాటు క్వాంటం లాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టామన్నారు. ఆదాయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉందని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉందని, ఏపీది మాత్రం రూ.93,903కు పడిపోయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో రూ.30,201 గ్యాప్ ఏర్పడిందన్నారు. రాజధానిని కోల్పోవడం వల్ల, ఎక్కువ జనాభా, తక్కువ ఆదాయ వనరులతో రాష్ట్రం ఏర్పడడంతో ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితి నుంచి అభివృద్ధి చేసేందుకు కష్టపడ్డామని గుర్తుచేశారు.

Advertisement

ఇలాంటి పరిస్థితులు ఉండగానే 30.5 శాతం మేర సీఏజీఆర్ వృద్ధి జరిగిందని, ఇది చారిత్రాత్మకమని చంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్డీపీ 13.5 శాతంగా ఉందని, అప్పుల జీఎస్డీపీ రేషియో 28.38 శాతంగా ఉందని ఆయన తెలిపారు. అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగాం కాబట్టి.. ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న రిసోర్స్ గ్యాప్ 10 శాతం నుంచి 8 శాతానికి తీసుకురాగలిగామన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పామని, బ్రాండ్ ఏపీని తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించామని తెలిపారు.