యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు (UPI Charges) విధిస్తూ కేంద్రం ఇవాళ పార్లమెంట్ లో బిల్లు ఆమోదించింది. దీనికి కొనసాగింపుగా బ్యాంకులు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో త్వరలోనే బ్యాంకులు మోత మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే దీని వెనుక ఉన్న ఓ షాకింగ్ రీజన్ ను విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేశ్ (Jairam ramesh) బయటపెట్టారు.
Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!
మోదీ ప్రభుత్వం తాజా పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు యూపీఐ లావాదేవీలను ఉచితంగా ఉంచే చట్టబద్ధమైన హామీని తొలగిస్తుందని, ఇది మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలకు మార్గం సుగమం చేస్తుందని, వీటిని భవిష్యత్తులో అన్ని చెల్లింపులకు సులభంగా విస్తరించవచ్చని జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ భారాన్ని అనివార్యంగా సామాన్య ప్రజలే మోయవలసి ఉంటుందన్నారు. ఎందుకంటే వారు ఇప్పుడు యూపీఐ లావాదేవీలను ఉపయోగించడానికి డబ్బు చెల్లించవలసి వస్తుందన్నారు. యూపీఐని ఆర్థికంగా నిలకడగా ఉంచడానికి ఇదే ఏకైక మార్గం అని మోదీ ప్రభుత్వం చేస్తున్న వాదన అబద్ధమన్నారు.
వ్యాపారులు లేదా వినియోగదారులపై ఛార్జీలు విధించకుండా యూపీఐ వ్యవస్థకు నిలకడగా నిధులు సమకూర్చే ఆర్థిక సామర్థ్యం ఆర్బీఐకి ఉందన్నారు. 2025-26లో ఆర్బీఐ మోదీ ప్రభుత్వానికి రూ.2.86 లక్షల కోట్లు బదిలీ చేసిందని, ఈ కీలకమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయానికి మద్దతు ఇవ్వడానికి ఈ అదనపు బదిలీలో ఒక చిన్న భాగం మాత్రమే సరిపోతుందన్నారు. నిజానికి, ఈ సవరణను ప్రవేశపెట్టడానికి గల అసలు కారణం మరింత ఆందోళనకరమైనదని తెలిపారు. ఉచితంగా ఉన్నందుకు యూపీఐ, రూపేలను విమర్శిస్తూ, వీసా, మాస్టర్కార్డ్ వంటి అమెరికన్ చెల్లింపు వేదికలను అవి తరిమివేశాయని ఆరోపించిన అమెరికా వాణిజ్య ప్రతినిధి నివేదిక తర్వాత ఇది జరిగిందన్నారు. తన మంచి స్నేహితుడైన డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ప్రధానమంత్రి యూపీఐని నీరుగార్చి, డిజిటల్ చెల్లింపుల రంగాన్ని అమెరికన్ వ్యాపారాలకు తెరవాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.NEET UG: నీట్ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం..! సుప్రీంకోర్టులో అఫిడవిట్ ..!