బెంగాల్ ఎన్నికల సమయంలోనేనా.. అమిత్ షా నిప్పులు


కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. అయితే కరోనా చుట్టూ రాజకీయాలు కూడా సాగుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దీదీపై నిప్పులు చెరిగారు.

2017 నుంచి ప్రణాళిక ప్రకారం వెళ్తున్నామని అమిత్ షా చెప్పారు. నక్సల్ బరీ ప్రచారం గురించి వివరించారు. 90 శాతం పోలింగ్ బూతులలో బీజేపీ హవా కనిపిస్తోందని వివరించారు. కానీ మోడీ ప్రభ మాత్రం మాములుగా పెరగలేదని చెప్పారు. అందుకు ఉదహరణలు కూడా వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం తథ్యం అని చెప్పారు. తమ పార్టీ 200 సీట్లను గెలచుకుంటుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

2016లోనే మమతాపై ప్రజల్లో అసంతృప్తి వచ్చిందని అమిత్ షా తెలిపారు. తర్వాత తమ పార్టీ విధానాలు, మౌలిక వసతులు గురించి విపులంగా చర్చించామని తెలిపారు. అదీ 2019 లోక్ సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని వివరించారు. 21 లోక్ సభ సీట్లను టార్గెట్ చేస్తే 18 చోట్ల విజయం సాధించామని చెప్పారు. 3 సీట్ల వరకు వెయ్యి ఓట్ల కన్నా తక్కువతో ఓడిపోయామని చెప్పారు.

YS Sharmila Arrest షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా స్పృహతప్పి YS Jagan రంగంలోకి దిగుతారా ?

దీంతోపాటు బెంగాల్ ఎన్నికల సమయంలోనే కరోనా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అసోం, కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కదా అని అడగారు.

Read more...

English Summary

Bengal under the shadow of the deadly coronavirus wave, the strategy to combat the crisis, the key issues in the polls, and the road ahead.