మోడీ, షా ప్రయత్నంతో కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందా లేక మరింత జఠిలమవుతుందా? మీ కామెంట్ ఏంటి?
జమ్మూ కాశ్మీర్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉత్కంఠకు తెరదించుతూ దశాబ్దాలుగా నలుగుతున్న కాశ్మీర్ సమస్యపై మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు గా విభజించింది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, అధికారాలు రద్దయ్యాయి. భారత రాజ్యాంగంలోని నిబంధనలన్నీ పూర్తిగా రాష్ట్రానికి వర్తించేందుకు వీలు కలిగింది. జమ్మూ కాశ్మీర్లో స్థానికతను నిర్వచించేందుకు వారికి ప్రత్యేక హక్కులు కల్పించేందుకు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చిన ఆర్టికల్ 35ఎకు కూడా ముగింపు పలికారు.
కేంద్రప్రభుత్వ నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాఖ్ శాసనసభలేని యూనియన్ టెరిటరీగా విడిపోనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన తీర్మానాలు, బిల్లులను సుదీర్ఘ చర్చ తర్వాత రాజ్యసభ ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రధాన రాజకీయపక్షాలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్లు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీంతో రాష్ట్రంలో అగ్ర నాయకులకు సోమవారం రాత్రి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

జమ్మూ కాశ్మీర్, లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. తన శైలికి భిన్నంగా వారిపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని వారికి సున్నితంగా మందలించారు. మత రాజకీయాలకు తాము, తమ పార్టీ ఎప్పటికీ దూరంగానే ఉంటుందని, వాటిపై తమకు ఏ మాత్రం విశ్వాసం లేదని ఎదురుదాడికి దిగారు. జమ్మూ కాశ్మీర్ ను ఎంతకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగిస్తారన్న ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని నిండు సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అలాంటి పరిస్థితులు త్వరలోనే రావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
మొత్తమ్మీద మోడీ ఆలోచన, అమిత్ షా చాతుర్యంతో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య ఓ కొలిక్కి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోడీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందా లేదా మరింత జఠిలం అవుతుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications