తెలంగాణ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణకు ఆమోదం: ఎంత మందినంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 సంవత్సరాలుగా 567 మంది ఉపాధ్యాయులు ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్నారు. వీరందరినీ రెగ్యూలరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. తాజా నిర్ణయం పట్ల సదరు కాంట్రాక్ట్ టీచర్లు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నారు.

డీఎస్సీ ద్వారా 5089 టీచర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 2575 ఎస్జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రకారం టెట్ క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొందించి డీఎస్సీకి పంపుతారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.
ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.
విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్గ్రేడ్ చేశామని మంత్రి తెలిపారు.
-
"ఆర్ఆర్బీ" గుడ్ న్యూస్.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్..! -
2026 ఏడాదిలో ఫ్రెషర్స్ కోసం టాప్ 10 బెస్ట్ జాబ్స్ ఇవే ..! -
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !!












Click it and Unblock the Notifications