పుష్ప సినిమాలో ఆ పాత్ర నేనే చేయాల్సింది.. కానీ ! - నారా రోహిత్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు "నారా రోహిత్". సీఎం చంద్రబాబు సోదరుడి కుమారుడుగా గుర్తింపు పొందిన రోహిత్.. బాణం మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సోలో (2011), ప్రతినిధి (2014), రౌడి ఫెలో (2014), అసుర (2015), అప్పట్లో ఒకడుండేవాడు (2016) వంటి విలక్షణమైన చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలానే జ్యో అచ్యుతానంద, సావిత్రి, కథలో రాజకుమారి వంటి సినిమాలు కూడా ఆయన కెరీర్లో ప్రత్యేకస్థానం సంపాదించాయి. రీసెంట్ గా వచ్చిన ప్రతినిధి 2 డిజాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి రికార్డులు కొల్లగొట్టిన పుష్ప చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను తాను చేయాల్సింది అని.. కానీ పలు కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని వ్యాఖ్యానించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రోహిత్ ఏమన్నారంటే.. తనను పుష్ప సినిమాలోని ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కోసం ముందు అడిగారని.. కొవిడ్ సమయంలో మీసాలతో ఒక ఫొటోను సిద్ధం చేసి నాకు పంపారు అని తెలిపారు. నిర్మాత కూడా ఆ పాత్ర గురించి తనతో మాట్లాడారని వివరించారు. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ సైతం చర్చించారని.. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి కాబట్టి.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రలో ఫహాద్ ఫాజిల్ను తీసుకున్నారని చెప్పారు.
భైరవం మూవీ తమిళంలో హిట్ కొట్టిన 'గరుడన్' సినిమాకు రీమేక్ గా రాబోతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. అందులో శశి కుమార్ చేసిన పాత్రను నారా రోహిత్ పోషిస్తున్నారు.
మరోవైపు భైరవం చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో.. ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడు ఎవరోకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడాడానికి మా కాల భైరవులు వచ్చి ధర్మాన్ని కాపాడతారు అంటూ డైరెక్టర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన చేసిన కామెంట్స్పై వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అలానే 2011 లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ను ట్రోల్ చేస్తూ విజయ్ కనకమేడల పెట్టిన పోస్టులను ఇప్పుడు వైరల్ చేస్తూ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వ్యవహరం సర్దుమనిగినట్టు కనిపించడం లేదు. రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో అయిన వీటికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications