లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం
మెగా ఫ్యామిలీలో ఒక వేడుక ముగిసింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఎంతో అంగరంగ వైభోగంగా ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ లో ఉంది. ఎక్కడెక్కడకి వెళుతుంది? అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. హనీమూన్ లో ఉండగానే లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్త వైరల్ గా మారింది.
వరుణ్, లావణ్య ఆరు సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ా సమయానికే కొన్ని సినిమాలు చేస్తోంది. అవి పూర్తయిన తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకోవాలా? వద్దా? అని ఆలోచించింది. ఇదే విషయాన్ని భర్త వరుణ్ తేజ్ తోపాటు అత్తమామలు నాగబాబు దంపతులను అడిగింది. సినిమాల్లో నటిస్తానంటే తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. లావణ్యకు ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నారు. వాస్తవానికి వివాహమైన తర్వాత సినిమాలు మానేసి వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంది.

అయితే చేతికి వస్తున్న ఆఫర్స తో కెరీర్ ని కాలదన్నుకోకూడదనే ఉద్దేశంతో నటించాలనే నిర్ణయం తీసుకుంది. వరుణ్ తేజ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. కెరీర్ ను ఎప్పుడూ వదులుకోకూడదని, ఎటువంటి హద్దులు లేవని చెప్పారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకుందంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెలబ్రిటీలు, స్టార్స్ ఇళ్లల్లోకి కోడలిగా వెళ్లేటప్పుడు సినిమాల్లో నటించడానికి చాలామంది అంగీకరించరు. వరుణ్ ఇంట్లో కూడా అంగీకరించరేమోననే భావనలో ఉన్న లావణ్య వ్యాపారం చేయాలని నిశ్చయించుకుంది. అయితే నటనకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో త్వరలోనే సినిమాలు చేయడానికి సిద్ధపడుతోంది.












Click it and Unblock the Notifications