కేజ్రీవాల్ గెలుపు-వామపక్షాలు ఏంనేర్చుకోగలవు?

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం వెనుక- కులం, మతాలు, ధన బలానికి అతీతంగా ఓటు వేసిన లక్షలాది సామాన్య ప్రజలు వున్నారు. అంటే; ఒక రాజకీయ పక్షం గనుక- నిజాయితీగా, ప్రజల పట్ల విశ్వాసంతో, పారదర్శకంగా, ప్రజల నుంచీ నాయకులనూ- తన అజెండాను ఎంచుకుంటూ, ముందుకు సాగితే జనాలు ఆ పక్షానికే నీరాజనాలు పడతారని నేడు రుజువయ్యింది. కాగా, ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్ర్యానంతరం- సుమారు ఆరున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో- పలు రాజకీయ పక్షాల విశ్వాసాలూ, వాటి పని తీరూ- నేడు ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా వామపక్షాలు ఈ దేశంలోని, జన సామాన్యానికి ప్రతినిధులుగా ఉన్నాయి. కానీ, అవి కాల క్రమేణా, తామూ తరచుగా విమర్శించే బూర్జువా భావజాలానికే తలొగ్గడం వలన- వాటికి జనాదరణ సన్నగిల్లింది. ఈ క్రమంలోనే అది- తమ పరాజయాలకూ, నిస్పృహలకూ కారణంగా- ఎన్నికల రంగంలో; డబ్బు, కులం, మతం, ‘ప్రభావాలను' చూడసాగాయి. ఈ వాదనలతోనే అవి, తరచుగా ఏదో ఒక ప్రధాన ‘బూర్జువా' పక్షంతో పొత్తులకూ, తద్వారా చట్ట సభలలో కొద్దిపాటి ప్రాతినిథ్యానికి గురయ్యాయి.
కానీ నేడు, అరవింద్ కేజ్రివాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలలో సాధించిన మానసిక విప్లవం- పై తరహా వాదనలను పటాపంచలు చేసింది. ఎన్నికలో గెలిచేందుకు కావాల్సింది- ధన బలం, కులం, మతాలు కాదనీ, అది నిబద్ధత, ప్రజల పట్ల విశ్వాసం, ప్రజా జీవితం నుంచే ఎంచుకున్న రాజకీయ అజెండాలు అని- ‘ఆమ్ ఆద్మీ' విజయం నిరూపించింది. కాబట్టి, వామపక్షాలు- ఇది తమ ఆత్మ విమర్శను- తాము ఇన్నాళ్లూ విశ్వసిస్తూ (విశ్వసింజేస్తూ- కూడా) వచ్చిన- ఈ నమూనాలపై గురిపెట్టవలసివుంది.
అయితే దీనర్థం, ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని కితాబులు, త్వరపడి ఇచ్చేయాలని కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ, తన ఆర్థిక అజెండానూ, మతతత్వం పట్ల తన దృక్పథాన్ని వెల్లడిస్తే గానీ- ఆ పార్టీ గురించి వ్యాఖ్యానించ గలిగింది, పెద్దగా ఏమిలేదనేది, వామపక్షాల వాదన! ఇదీ సమంజసమైనదే. ఎందుచేతనంటే; నేడు ఆమ్ ఆద్మీ పార్టీ మూల అజెండా అయిన అవినీతి పోరాటం అంశం- నిజానికి, నేడు దేశంలో అమలు జరుగుతోన్న నయా ఉదారావాద విధానాలతో ముడిపడి వుంది. 1990ల నుంచీ దేశంలో అమలు జరుగుతోన్న, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ- ఆర్థిక విధానాల నుంచీ, నేడు దేశంలోని అపరిమితమైన అవినీతి పుట్టుకొస్తోంది. కాబట్టి; ఈ నయా ఉదారవాదం అంశంగా- ఆమ్ ఆద్మీ పార్టీ, తన వైఖరిని స్పష్టం చేయాలి. అలాగే, మతతత్వం అంశం కూడా.
అయితే అదే సమయంలో వామపక్షాలు కూడా కొన్ని అంశాలపై ఆత్మ విమర్శను అనివార్యంగా చేసుకోవాలి. వాటిలో ఒక ముఖ్య అంశం- అది, గతంలో ఎన్నడూ-నయా ఉదారవాద విధానాలను అనుసరిస్తోన్న, ఏ రాజకీయ పక్షంతోనూ జట్టు కట్టనే లేదా? తాము లౌకికవాదులుగా విశ్వసించిన నాయకులు, బిజెపి పంచన చేరడం లేదా? మరి, దీని సారం ఏమిటి? దీనికి, మనం వామపక్షాల నుంచి జవాబును ఆశించవచ్చు. అందుచేత, అంతిమంగా; గొప్ప శాస్త్రీయ సిద్ధాంతం పునాదుల నుంచి జన్మించిన వామపక్షాలు, తిరిగి ‘బ్యాక్ టు బ్యాసిక్స్' ప్రయాణాన్ని ఆరంభించాలి. అది జరిగిన నాడే- దేశంలోని పలు ఆర్థిక- రాజకీయ -సామాజిక సమస్యలకు పరిష్కారం చూపగల- ఒక బలమైన రాజకీయ మార్గం మన ముందు ఏర్పడగలదు!!
-డి. పాపారావు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications