ఐపియల్ ఫిక్సింగ్ లు?

కాగా, ఐపియల్ యజమానులు ఫిక్సింగ్ ఆరోపణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఐపియల్ కొచ్చి జట్టు విషయంలో శశి థరూర్ పాత్రను ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ బయట పెట్టడంతో వివాదం రాజుకుంది. ఈ వ్యవహారంతో మంత్రి పదవికి థరూర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆదే సమయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకుల పాత్రపై కూడా ఆరోపణలు మొదలయ్యాయి.
ఐపియల్ వివాదం ఎన్సీపి నేతలను కూడా చుట్టుముట్టింది. ఎన్సీపి చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్, వారి కుటుంబ సభ్యుల పాత్రపై ఆరోపణలు వచ్చాయి. వారు ఆ ఆరోపణలు ఖండిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం నమ్మడం లేదు. ఎన్సీపి నేతలను కాపాడడానికి కాంగ్రెసు ప్రయత్నిస్తోందని, యుపిఎలో భాగస్వామ్య పార్టీ కాబట్టి అందుకు ప్రభుత్వం పూనుకుందని ప్రతిపక్షాలు విమర్సిస్తున్నాయి.
ఐపియల్ వివాదం శశి థరూర్, లలిత్ మోడీతో ప్రారంభమై కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు పూనుకుంటుందా, మరో రకమైన విచారణకు సిద్ధపడుతుందా అనేది ప్రశ్న. ఐటి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ ప్రతిపక్షాలు రాజకీయపరమైన అంశంగా దాన్ని పరిగణిస్తున్నాయి. అందుకే సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించాల్సిన పరిస్థితిలో పడినట్లేనని అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications