Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాలిలేని ‘కసాయి’గుండెలు..!!

Killing Child For Money!!
''కేవలం డబ్బు కోసం అబం శుభం తెలియని చిన్నారులను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకుంటున్నారు వారిది మానవ జన్మనే..?, అంతకంతకి క్షోభను అనుభవిస్తారు "" - జిల్లాలో చోటుచేసుకున్న చిన్నారుల హత్య ఉధంతాల పై 'ఓ రగిలిన గుండె స్పందన".

డబ్బు ముందు బంధాలన్ని దిగదుడిపేనని ఆ భయానక సంఘటనలు రుజువు చేసాయి..., డబ్బే ప్రధాన లక్ష్యంగా జరిగిన ఆ చిన్నారుల హత్యలు కసాయి మనుషుల కర్కశత్వాన్ని బయటపెట్టాయి.., సామాజిక దృక్పధంతో వెలగాల్సిన సాటి మనిషి కర్కశత్వంగా ప్రవర్తిస్తున్నాడనటానికి ఇవోక ఉదోహరణులు. మొన్న నాగ వైష్ణవి, నిన్న రాహుల్, నేడు అన్వేష్, లలిత కుమారి జాలి లేని కసాయి మనషుల చేతిలో దారుణ హత్యకు గురుయ్యారు.

విజయవాడలోని ప్రముఖ ప్రారిశ్రామికవేత్త గారాల పట్టి నాగ వైష్ణవి అయినవారి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని కాల్చి బూడిత చేశారు హంతకలు. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ కన్న తండ్రి గుండెపోటుతో మరణించాడు. యూవత్ రాష్ట్రాన్నే శోక సంధ్రంలో ముంచెత్తిన ఈ ఘటనను చరిత్రలో మాయని మచ్చలా నిలిచింది. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికి విచారణ నత్తనడకన సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా కేసు ఓ కొలిక్కి రావడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.

డబ్బుకోసం నూజివిడుకు చెందిన 'రాహుల్"ను కిడ్నాప్ చేసి హతమార్చిని సంఘటన కొన్ని నెలల క్రితంలో జిల్లాలో సంచలనాన్ని రేకెత్తించింది. 'రాహుల్" తండ్రి సురేష్ స్నేహితులే డబ్బు కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీస్ విచారణలో తేలింది. తాజాగా గుడివాడ పరిధిలో చోటుచేసుకున్న రెండు దారుణాలు రాక్షస మనుషులు ఉన్మాదత్వాన్ని బయటపెట్టాయి.

గుడివాడ సత్యనారాయణపురంకు చెందిన ప్రభు కుమార్ ముద్దుబిడ్డ మత్తి అన్వేష్ చంద్ర కిడ్నాప్ గురై ఆపై హతమార్చబడ్డాడు. అన్వేష్ తండ్రి ప్రభుకుమార్ తో నెలకున్న డబ్బు వివాదం కారణంగానే కుమారుడును కిడ్నాప్ చేసిన నిందితులు 10 లక్షల డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించినప్పటికి అన్వేష్ తిరిగి రాలేదు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.

కైకలూరుకు చెందిన లలిత కుమారి (10) దుండగుల చేతిలో అతికిరాతకంగా హతమార్చబడింది. బాలికపై మానభంగం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులెవరో తెలిసినప్పటికి ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే కేసును నమోదు చేయ్యటానికి పోలీసులు జంకుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంతంగా ఉండే కృష్టా జిల్లా ఇటీవల కాలంలో పాశవిక చర్యలకు నిలయంగా మారుతుంది. సులువుగా డబ్బు సంపాందించే మార్గాలపై మోజు చూపుతున్న పలువురు ప్రాణాలు తీయటానికి సైతం వెనకాడటం లేదు. రాజకీయ పార్టీల అండదండలతో దర్జాగా నేరాలకు పాల్పడుతున్న పలువురు దర్జాగా అన్ని హోదాలు అనుభవిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+