భారత సైన్యం: మలాలాకు తాలిబన్ల లేఖలో గాంధీజీ

మహమ్మద్ ప్రవక్త బోధనల నుంచి నువ్వు నేర్చుకున్న ప్రేమ.. కరుణ భావానలను పాకిస్తాన్ సైన్యం కూడా అలవర్చుకోవాలని, అప్పుడే ముస్లింల రక్తపుటేరులు ప్రవహించకుండా ఉంటాయని అందులో పేర్కొ న్నారు. ఏసుక్రీస్తు బోధనల సారాంశాన్ని అమెరికా, నాటో దేశాలు అనుసరించాలని రాశారు. గౌతమ బుద్ధుడి బోధనలను ఆయన భక్తులు ఆచరించాలని, అలాగే భారత సైన్యం ఆ దేశ జాతిపిత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని రషీద్ తన లేఖలో ప్రస్తావించడం ఆశ్చర్యకరం.
కాగా మలాలాను తిరిగి పాకిస్తాన్ వచ్చేయాల్సిందిగా తాలిబన్ల ప్రతినిధి రషీద్ ఆమెకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మలాలా వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నానని, తన వూరికి వచ్చి చేరువలో ఉండే ఏదైనా ఆడపిల్లల మదర్సాలో చేరాలని, అల్లా గ్రంథాన్ని చదువుకోవాలని, ఇస్లాం.. ముస్లింల ఆవేదనను ప్రపంచానికి తెలియజేయడానికి తన కలం బలాన్ని ఉపయోగించాలని రషీద్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖలో రెండు వేలకు పైగా పదాలున్నాయి. మలాలాపై దాడిని రషీద్ సమర్థించుకున్నాడు. తాలిబన్ వ్యతిరేక ప్రచారంలో మలాలా భాగస్వామి అయ్యారన్నాడు. మలాలా పాఠశాలకు వెళ్తోందని, చదువును ప్రేమిస్తోందని తాము దాడి చేయలేదని, చదువు కోవడాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నాడు.
అయితే ఉద్దేశ్యపూర్వకంగా తాలిబన్లకు వ్యతిరేకంగా రాతలు రాస్తున్నట్లు విశ్వసించామని, స్వాత్లో ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేసే తమ ప్రయత్నాలను అపఖ్యాతి చేసే ప్రచారాలకు పాల్పడిందని, ఆ మాటలు, రాతలు తమను కవ్వించేలా ఉన్నాయన్నారు. ఐక్యరాజ్య సమితిలో మలాలా చేసిన ప్రసంగం శత్రువుల చేతిలో కీలుబొమ్మలా మారినట్లుగా ఉందన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications