త్రిశికతో మైసూరా మహారాజు వివాహం (పిక్చర్స్)
బెంగళూరు: మైసూరా మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయారు వివాహం సోమవారం నాడు జరిగింది. ఆయన రాజస్థాన్కు చెందిన త్రిశిక కుమారి సింగ్ని పెళ్లి చేసుకున్నారు. ఈమె దుంగార్పూర్ కుటుంబానికి చెందిన యువతి. పెళ్లి వేడుకలు ఈ నెల 24వ తేదీన ప్రారంభమయ్యాయి.
సోమవారం జరిగిన ఈ పెళ్లి వేడుకకు 500 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన వారిలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా అంబాసిడర్లకు ఆహ్వానం వెళ్లింది.
యదువీర్ వివాహం
24వ తేదీ నుంచి వివిధ ధార్మిక కార్యక్రమాలతో మైసూరు రాజప్రాసాదం సందడిగా మారింది. సోమవారం ఉదయం 9.05 నుంచి 9.35 గంటల నడుమ కర్కాటక లగ్నంలో యధువీర్, త్రిశికా కుమార సింగ్ల వివాహం జరిగింది.
యదువీర్ వివాహం
శనివారం రాత్రే రాజప్రాసాదంలోకి త్రిశికా అడుగు పెట్టారు. ఆదివారం ఉదయం నుంచి హోమాలు, గణపతి పూజ, సమర్తనా హోం, శకునశాస్త్రం, పూజలు, యజ్ఞోపవీత ధారణలో యధువీర్ పాల్గొన్నారు. చాముండేశ్వరి అమ్మవారికి యధువీర్ పూజలు చేశారు.
యదువీర్ వివాహం
అల్లుడికి దుంగార్పూర్ యువరాజు హర్షవర్ధన్ సింగ్, మహేశ్వరికుమారి వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం కాశీయాత్రను నిర్వహించారు.
యదువీర్ వివాహం
దత్తతండ్రి శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయరు చిత్రపటానికి పూజ చేశారు. రాజమాత ప్రమోదాదేవి ఆశీర్వచనం తీసుకున్నారు. ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
యదువీర్ వివాహం
త్రిశికతో మైసూరా మహారాజు వివాహం
యదువీర్ వివాహం
త్రిశికతో మైసూరా మహారాజు వివాహం
యదువీర్ వివాహం
త్రిశికతో మైసూరా మహారాజు వివాహం
యదువీర్ వివాహం
త్రిశికతో మైసూరా మహారాజు వివాహం
యదువీర్ వివాహం
త్రిశికతో మైసూరా మహారాజు వివాహం