సహజ అందాలతో ఆకట్టుకున్న ఆర్ట్ గ్యాలరీ(పిక్చర్స్)
హైదరాబాద్: ‘ఆర్ట్ అండ్ ఇరానీ చాయ్ దోబరా' పేరిట ప్రముఖ చిత్రకారుడు కిషోర్ సింగ్ గీసిన 29 చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం లోయర్ ట్యాంక్బండ్ హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఉంచారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్ట్ గ్యాలరీని ఇరానీ చాయ్ తాగుతూ వీక్షించారు. నగరంలోని సంస్కతిక సంప్రదాయాలను ఆర్టిస్టు కళ్లకు కట్టినట్లు చిత్రాలలో చూపించారని కిషోర్ సింగ్ను మంత్రి అభినందించారు.
కిషోర్ సింగ్ గీసిన చిత్రాలు వెలకట్టలేనివని, హైదరాబాద్ నగర జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయని మంత్రి పద్మారావు అన్నారు. చిత్రకారుడు కావాలంటే అనేక సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. కిషోర్ సింగ్ను ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఉంటుందని చిత్రకారుడు కిషర్ సింగ్ తెలిపారు.
చార్మినార్, మక్కామజీద్, ఇరానీ హోటల్లో చాయ్ తాగుతున్న వ్యక్తులు, తోపుడు బండ్లపైన వస్తువులు విక్రయిస్తున్న చిరువ్యాపారుల జీవన చిత్రం కళ్లకు కట్టినట్లు పెయింటింగ్స్ కనిపించాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ కో-ఆర్డినేటర్ అహ్మద్ ఖాన్, మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కాలి సుధీర్, ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.

ఆర్ట్ గ్యాలరీ
‘ఆర్ట్ అండ్ ఇరానీ చాయ్ దోబరా' పేరిట ప్రముఖ చిత్రకారుడు కిషోర్ సింగ్ గీసిన 29 చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

ఆర్ట్ గ్యాలరీ
ఆదివారం లోయర్ ట్యాంక్బండ్ హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఉంచారు.

ఆర్ట్ గ్యాలరీ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు.

ఆర్ట్ గ్యాలరీ
అనంతరం మంత్రి పద్మారావు ఆర్ట్ గ్యాలరీని ఇరానీ చాయ్ తాగుతూ వీక్షించారు.

ఆర్ట్ గ్యాలరీ
నగరంలోని సంస్కతిక సంప్రదాయాలను ఆర్టిస్టు కళ్లకు కట్టినట్లు చిత్రాలలో చూపించారని కిషోర్ సింగ్ను మంత్రి అభినందించారు.

ఆర్ట్ గ్యాలరీ
కిషోర్ సింగ్ గీసిన చిత్రాలు వెలకట్టలేనివని, హైదరాబాద్ నగర జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయని మంత్రి పద్మారావు అన్నారు.

ఆర్ట్ గ్యాలరీ
చిత్రకారుడు కావాలంటే అనేక సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. కిషోర్ సింగ్ను ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు.

ఆర్ట్ గ్యాలరీ
సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఉంటుందని చిత్రకారుడు కిషర్ సింగ్ తెలిపారు.

ఆర్ట్ గ్యాలరీ
చార్మినార్, మక్కామజీద్, ఇరానీ హోటల్లో చాయ్ తాగుతున్న వ్యక్తులు, తోపుడు బండ్లపైన వస్తువులు విక్రయిస్తున్న చిరువ్యాపారుల జీవన చిత్రం కళ్లకు కట్టినట్లు పెయింటింగ్స్ కనిపించాయి.

ఆర్ట్ గ్యాలరీ
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ కో-ఆర్డినేటర్ అహ్మద్ ఖాన్, మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కాలి సుధీర్, ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.

ఆర్ట్ గ్యాలరీ
ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించిన చిత్రాలను మంత్రి పద్మారావు ఆసక్తిగా తిలకించారు. చిత్రాలు అద్భుతమని కొనియాడారు.

ఆర్ట్ గ్యాలరీ
ఆర్ట్ గ్యాలరీలోని ఓ పెయింటింగ్ను ఆసక్తిగా తిలకిస్తున్న విదేశీ మహిళలు.

ఆర్ట్ గ్యాలరీ
హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనలోని పెయింటింగ్ను ఆసక్తిగా వీక్షిస్తున్న యువతి.

ఆర్ట్ గ్యాలరీ
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పద్మారావుకు పెయింటింగ్ విశేషాలను తెలుపుతున్న కిశోర్ సింగ్.












Click it and Unblock the Notifications