కెసిఆర్ ఆటలు సాగుతాయా?

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించడంలో ఇప్పటి వరకు కెసిఆర్ ను మించిన నాయకుడు లేడనే పేరు ఆయనకు ఉంది. కానీ ఆయన చిత్తశుద్ధిపై అవిశ్వాసం పెరిగిపోతోంది. ఆయన ఎన్నికల్లో టికెట్లు కేటాయించిన తీరుపైనే విపరీతంగా విమర్సలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఆయన ఎంపిక చేసుకున్న సీట్ల తీరు, అభ్యర్థుల ఖరారు తీవ్ర అనుమానాలకు తావిచ్చాయి. ఆయనపై తీవ్ర అనుమానాలు కూడా పొడసూపాయి. సికింద్రాబాద్ టికెట్టును కెసిఆర్ కు డబ్బులిచ్చి తెచ్చుకున్నానని వెంకట రెడ్డి అనే నాయకుడు చెప్పిన తర్వాత ఆయన అటువంటి చర్యలకు ఎన్నింటికి పాల్పడ్డాడో అనుమానాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నిర్వహిస్తున్న పార్టీ సమీక్ష సమావేశాలు కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు.
పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అక్కడికి నాయకులను పిలిపించుకుంటున్నారు. ఉద్యమ కమిటీలు, రాష్ట్ర కమిటీ, క్రమశిక్షణ కమిటీ వంటిని ఏర్పాటు చేయడానికి ఆయన ముఖ్య నాయకులను ఢిల్లీకి ఆహ్వానించారు. నాయని నర్సింహారెడ్డి, విజయరామారావు, నిరంజన్ రెడ్డి వంటి కొంత మంది నేతలు ఢిల్లీకి బయలుదేరారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications