కమలం'జిన్నా'భిన్నం

జస్వంత్ సింగ్ జిన్నాను ప్రశంసిస్తూ రాసిన పుస్తకంతో కమలం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జస్వంత్ సింగ్ పార్టీనుంచి బహిష్కరించిన తీరు కూడా తీవ్ర విమర్శలకు గురైంది. నిజానికి, ఆయనపై చర్య తీసుకునే విషయంలో బిజెపి నాయకత్వం పద్ధతిని పాటించలేదు. జస్వంత్ కు షోకాజ్ నోటీసు జారీ చేయకుండానే, ఆయన వివరణ కోరకుండానే ఆయనపై వేటు వేసింది. అంత తొందరపడి అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ లు ఎందుకు వ్యవహరించారనేది చాలా మందికి అర్థం కాని విషయం. అయితే పార్టీపై తమ పట్టు ఉందని ప్రకటించుకోవడానికి, మిగతా నాయకులు ముందస్తు హెచ్చరికగా జస్వంత్ పై ఏకపక్షంగా వేటు వేసినట్లు భావించవచ్చు. అయితే, జస్వంత్ పై చర్యకు భయపడే స్థాయి బిజెపిలో చాలా మందికి లేదని తేలిపోయింది.
ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు అరుణ్ శౌరీ పార్టీ నాయకత్వంపై తీవ్రమైన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాజ్ నాథ్ ను బ్లండర్ లాండ్ లో అలైస్ గా అభివర్ణించారు. బిజెపిని హంప్టీ డంప్టీగా వ్యాఖ్యానించారు. మావో మాటలను తీసుకుని కేంద్ర కార్యాలయాన్ని ఢీకొట్టాలని అన్నారు. కాందహార్ ఘటనపై అద్వానీ చెప్పిన మాటలు అబద్ధమని కూడా తేల్చేయడానికి అసమ్మతి నాయకులు కంకణం కట్టుకున్నారు. కాందహార్ విమానం హైజాక్ ఘటనలో ఉగ్రవాదుల విడుదల విషయం తనకు తెలియదని అద్వానీ చెప్పిన మాటల్లో నిజం లేదని చెబుతున్నారు. ఆ విషయం అద్వానీకి తెలుసునని యశ్వంత్ సిన్హా, బ్రజేష్ మిశ్రా అన్నారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అద్వానీకి ఆ విషయం తెలియడం లేదంటే తప్పంతా అప్పటి ప్రధాని వాజ్ పేయిదేనని చెప్పడమన్న మాట. కానీ, దాన్ని జీర్ణించుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేరు. దీంతో అద్వానీని మూలకు నెట్టే ప్రయత్న చేస్తున్నారు. గుజరాత్ అల్లర్ల సమయంలో వాజ్ పేయి మోడీపై చర్యకు సిద్ధపడ్డారని, కానీ అద్వానీ అడ్డుకున్నారని జస్వంత్ సింగ్ చెప్పారు.
వాజ్ పేయి తర్వాత పార్టీని విజయపథంలో నడిపి ప్రధాని పదవి చేపట్టాలని ఆశించిన అద్వానీకి చుక్కెదురు కావడమే కాకుండా సొంత పార్టీలోనే ముసలం మొదలై ఆయన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసే పరిస్థితి వచ్చింది. బిసి ఖండూరీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. రాజస్థాన్ విపక్ష నేత వసుంధర రాజే సింధియా నాయకత్వం మాట వినడానికి వెనకాడుతున్నారు. ఈ స్థితిలో రాజ్ నాథ్ సింగ్ గురువారం సాయంత్రం ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ ను కలుసుకున్నారు. ఫలితం ఏమిటో తెలియడం లేదు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుదర్శనం జిన్నాపై జస్వంత్ వ్యాఖ్యలను సమర్థించారు.
మొత్తం మీద, బిజెపి వ్యవహారం పైకి కనిపించేత మామూలుగా లేనట్లు అనిపిస్తోంది. తీవ్రమైన సైద్ధాంతిక విబేదాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు కూడా అనిపిస్తోంది. దేశ విభజన విషయంలో నెహ్రూను, సర్దార్ పటేల్ ను దోషులుగా నిలబెట్టి, జిన్నాను సమర్థించడం ద్వారా ముస్లిం సమాజం మద్దతు సంపాదించడానికి, కాంగ్రెసును ఇరకాటంలో పెట్టడానికి అవసమైన సైద్ధాంతిక భూమికకు ప్రచారం కల్పించే పనిని బిజెపిలోని, సంఘ్ పరివార్ లోని ఒక వర్గం పూనుకున్నట్లు భావించవచ్చు. జిన్నాను సమర్థిస్తూ ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి గతంలోనే ఒక పుస్తకం రాశారు. పాత ఆయుధాన్ని కొత్తగా తీయాలనే వర్గం ఒకటి తయారైనట్లు చెప్పవచ్చు. ఈ స్థితిలో అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ ల పరిస్థితి ఎటూ కాకుండా పోతుందా, ఆలోచించాల్సిన విషయమే.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications