జగన్ మొండికేయడం వల్లనే..

వైయస్ జగన్ ఏ మాత్రం తన వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఓదార్పు యాత్రను చేపట్టి తీరాల్సిందేననే వాదనతోనే ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్రలో సోనియా పేరును గానీ, ఇతర కాంగ్రెసు నాయకుల పేర్లను గానీ ప్రస్తావించకుండా కేవలం వైయస్ రాజశేఖర రెడ్డి పేరును మాత్రమే ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి కె. రోశయ్యపై విమర్సలు చేయడాన్ని బట్టే జగన్ మరో ఆలోచనతో ఉన్నట్లు ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది.
జగన్ తీరు చూశాక ఎదురు దాడికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి ఎపిఐఐసి కుంభకోణం గురించి మాట్లాడారని చెబుతున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు ఆ భూములు అప్పగించిన సమయంలో ఎపిఐఐసి చైర్మన్ గా జగన్ కు అధికార ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు ఉండడం వారి ఆరోపణలకు మరో కారణంగా చెబుతున్నారు. డిఎల్, జెసిలపై అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రస్తుత తరుణంలో జగన్ పై ప్రత్యక్ష, పరోక్ష యుద్ధానికి అధిష్టానం సిద్ధపడుతోంది. వైయస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని లావాదేవీలను ఒక్కొక్కదాన్నే ముందుకు తెచ్చి జగన్ వర్గాన్ని ఇరకాటంలో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైయస్ జగన్ ఆస్తులపై కూడా అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. జగన్ ఇక నేరుగా రంగంలోకి దిగి అధిష్టానాన్ని ఢీకొనాల్సిందే.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications