వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ను నమ్ముతారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ ఇక పార్టీ పెట్టి, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారనేది తెలిసిపోతూనే ఉంది. వైయస్ జగన్ సభలకు పెద్ద యెత్తున ప్రజలు వస్తున్నారనేది కాదనలేని విషయం. ఆ ప్రజలంతా వైయస్ జగన్ వెంట ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. జగన్ పెట్టే కొత్త పార్టీకి ఓట్లు వేయాల్సి ఉంటుంది. అలా వేస్తారా అనేది కూడా చెప్పలేని విషయం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత కూడా చిరంజీవి సభలకు భారీగా ప్రజలు వచ్చారు. కేరింతలు కొట్టారు. కానీ చిరంజీవి ఎన్నికల్లో ఘోర ఫలితం చవి చూశారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల సందర్భంగా లక్ష్మీపార్వతి తన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పోటీకి దించారు. ఆమె సభలకు కూడా పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. కానీ, ఆమె ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. అయితే, వైయస్ జగన్ కు వారికి చాలా తేడా ఉందనే వ్యాఖ్య వైయస్ జగన్ వర్గీయుల నుంచి వినిపిస్తోంది.

చిరంజీవి ప్రజాకర్షణ గల నాయకుడని, చిరంజీవి ప్రజలు చూసి వెళ్తారని, వైయస్ జగన్ కు ప్రజాకర్షణతో పాటు ప్రజాదరణ ఉందని రోజా అంటున్నారు. అందువల్ల వైయస్ జగన్ కు ప్రజలు ఓట్లు వేస్తారని వైయస్ జగన్ వర్గీయులు భావిస్తున్నారు. అలా అంచనా వేస్తున్నారు. పైగా, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కోసం కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు రాలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీలో అవమానం జరిగింది కాబట్టి బయటకు వచ్చారని రోజా, అంబటి రాంబాబు వంటి నాయకులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ఈ ప్రయత్నాలు చేయడం లేదని చెప్తే రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వారెంతగా చెప్పినా వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసు.

కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. వైయస్సార్ ను కాంగ్రెసుకు దక్కకుండా చేసి తన సొంత చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో వైయస్సార్ ను మించిన నాయకుడు లేడని, కాంగ్రెసుకు అత్యంత విశ్వాస పాత్రుడైన నాయకుడని కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ నాయకత్వం కారణంగానే వైయస్సార్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. ఈ వాదన నమ్మేందుకు అనుగుణంగానే ఉంది. దానికి తోడు, వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్ కు దూరం చేయగలిగింది. ఈ పరిస్థితిలో వైయస్ జగన్ పార్టీ పెడితే నెట్టుకురావడం అంత సులభమైన విషయం కాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X