పోటీపై చిరంజీవి డైలామా!

కడప లోక్సభకు జరిగిన గత సాధారణ ఎన్నికల ద్వారా పీఆర్పీ మంచి ఓటుబ్యాంకును అక్కడ కలిగి ఉందని నిరూపించింది. ఆ ఓటుబ్యాంకును కాంగ్రెస్కు మద్దతివ్వడం ద్వారా గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. చిరు మద్దతిస్తే జగన్ను ఓడించటం కాంగ్రెస్కు కష్టమేమీ కాదని పలువురు భావిస్తున్నారు. మద్దతు ఇవ్వకుండా ఉపఎన్నికల బరిలో పీఆర్పీ నిలిస్తే మాత్రం కాంగ్రెస్కు ఇబ్బందే. అయితే రాజ్యసభ ఎన్నికల్లో సుహృద్భావంతో చిరు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే దారిలో వెళ్లే అవకాశం ఉండవచ్చు.
పార్టీకి భారీగా ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ గెలిచే అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికే చిరు ప్రధాన్యత ఇస్తారని తెలుస్తోంది. మళ్లీ మళ్లీ ఎన్నికలకు పోయి ప్రజలను ఇబ్బందులలోకి నెట్టే ఉద్దేశ్యం తనకు లేదని అందుకే ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మద్దతు ఇస్తానని చెబుతూనే, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం తీవ్రస్థాయిలో ఆందోళన తెలుపుతానని చిరంజీవి అంటున్నారు. అంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆయన కాంగ్రెస్కు మద్దతు పలకవచ్చని పలువురు భావిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వడం ద్వారా తమ పార్టీ భవిష్యత్తు ప్రయోజనాలు కూడా చిరంజీ్వి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్తో కలిసినప్పటికీ భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి నష్టం కాకుంటా ఉండే దిశలో ఆలోచిస్తారు. ఇటు కాంగ్రెస్ కూడా జగన్తో పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గెలుపుకు కావాల్సిన ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పీఆర్పీతో పొత్తుకు ప్రయత్నాలు చేయవచ్చు. అవసరమైతే అధిష్టానం సహాయంతో చిరుతో పొత్తుకు సిద్ధపడవచ్చు.












Click it and Unblock the Notifications