వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన మొదట్లో కాస్తా దూకుడుగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దాదాపుగా మౌనంగానే ఉన్నారు. అంతేకాకుండా దీక్షలు విరమించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయగానే 48 గంటల బంద్‌కు, వంటా వార్పునకు, రైల్ రోకో కార్యక్రమాలకు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను పక్కన పెట్టి పిలుపునిచ్చారు. రాజీనామాలు చేసిన తెలుగుదేశం, కాంగ్రెసు ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే ఆ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే, తర్వాత వంటావార్పు, రైల్ రోకో కార్యక్రమాలను కోదండరామ్ వాయిదా వేశారు.

ఇప్పుడు కెసిఆర్ పెద్దగా ఉద్యమాల జోలికి వెళ్లే స్థితిలో లేనట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు మాత్రం దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధపడ్డారు. తెలుగుదేశం తెలంగాణ నేతలు బస్సు యాత్ర చేపడితే, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు 48 గంటల నిరాహారదీక్షకు పూనుకున్నారు. రాజీనామాల విషయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. రాజీనామాలు చేసిన తర్వాత వారు చాలా వరకు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని చెప్పవచ్చు. తెలంగాణ విషయంలో తమ మనుగడకు తీవ్రమైన ప్రమాదం వాటిల్లిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల నాయకులు తిరిగి తమ ఉనికిని ఖాయం చేసుకోవడానికి ఈ ఉద్యమాల ద్వారా ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.

కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తూ ఆందోళన బాట పట్టడం వల్ల కాంగ్రెసు అధిష్టానం దిగి వస్తుందని నమ్ముతున్నట్లే కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని కూడా ఆయన విశ్వసిస్తున్నారు. ఇదే కోణంలో ఆయన మీడియాలో కూడా వార్తాకథనాలు వస్తున్నాయి. అందువల్ల పెద్ద యెత్తున ఆందోళనలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గబోరని, వారు వెనక్కి తగ్గితే చూసుకోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

English summary
TRS president K Chandrasekhar rao is almost all silent on telanagana issue, as he believing that Telangana state formation will become true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X