తెరాస సవాల్, పంతం నెగ్గించుకున్న చంద్రబాబు

Chandrababu Naidu
వరంగల్ జిల్లాలో రైతు పోరు బాట నిర్వహించే విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పంతం నెగ్గించుకున్నారు. తాను తెలంగాణలో పర్యటించగలనని, తనను ఎవరూ అడ్డుకోలేరని ఆయన నిరూపించారు. చంద్రబాబును అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ రాజకీయ జెఎసి చేసిన హెచ్చరికలను ఆయన సవాల్‌గా స్వీకరించారు. వరంగల్ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకోవాలని జిల్లా ఎస్పీ చేసిన సూచనను కూడా ఆయన పట్టించుకోలేదు. తాను పర్యటించి తీరుతానని చెప్పి, ఆ విధంగానే చేశారు. చంద్రబాబు వరంగల్ జిల్లాకు చేరుకునే వరకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. వాటిని అధగమిస్తూ ఆయన వరంగల్ జిల్లా లక్ష్మక్కపల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రైతు పోరుబాటలో భాగంగా పాదయాత్ర చేశారు. పాలకుర్తి బహిరంగ సభలో మాట్లాడారు.

పాలకుర్తి బహిరంగ సభలో ఆయన ప్రసంగం కూడా తెరాసను టార్గెట్ చేసుకుని సాగింది. తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాను క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా వైదికపైకి కొంత మంది చెప్పులు విసిరారు. సభలో గందరగోళం సృష్టించారు. వారిపై ఆయన నిప్పులు చెరిగారు. రైతు పోరుబాటు పేరుతో ఆయన చెప్పినప్పటికీ తాను తెలంగాణలో పర్యటించడమనేదే ఆయన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. తెరాస, తెలంగాణ జెఎసి విసురుతున్న సవాళ్లను అధిగమించడం ఎలా అనేదే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

తెలుగుదేశం తెలంగాణ నాయకులు కూడా వేదికపై నుంచి ప్రసంగించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, కడియం శ్రీహరి, టి. దేవేందర్ గౌడ్ తదితర తెలంగాణ నాయకులు కెసిఆర్‌పై, తెరాసపై నిప్పులు చెరిగారు. తెరాస టార్గెట్‌గానే బహిరంగ సభ నుంచి ప్రసంగాలు సాగాయనే విమర్శ ఉంది. ఏమైనా, చంద్రబాబు మాత్రం తన పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+