మాచర్ల: సెంటిమెంట్తో 'జగన్' ఢీ, చిరు నిలబెట్టేనా?

ఈ ఎన్నికల్లో పిన్నెల్లికి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బాబాయ్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మా రెడ్డి నిలిచారు. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ... వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉండేది. ఇప్పుడు వీరే పోటీలో ప్రధాన ప్రత్యర్థులుగా నిలవడంతో పోటీ రసకందాయంలో పడింది. వైయస్సార్ కాంగ్రెస్కు ప్రధాన బలంగా భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చే సత్తా ఉన్న లక్ష్మా రెడ్డి, మిగతా వర్గాల అండతో విజయం సాధించగలననే ధీమాతో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేరికతో కాపు ఓట్లపై ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. జగన్ అరెస్టు అనంతరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు మరింత హుషారుగా పని చేస్తున్నారు. ఇక తెలుగుదేశం తరఫున మాజీ ఐపిఎస్ అధికారి చిరుమామిళ్ళ వెంకట నర్సయ్య కుమారుడు మధు బాబును రంగంలోకి దించారు. తొలుత నర్సయ్యనే అభ్యర్థిగా నిలపాలని భావించినప్పటికీ... యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉంటుందని ఆయన కుమారుడి వైపు మొగ్గు చూపారు.
స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నర్సయ్య... పదవీ విరమణ అనంతరం టిడిపికి దగ్గరయ్యారు. చాలా ఏళ్ల తర్వాత ఆ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి పోటీ చేసే అవకాశం రావడంతో... వారంతా కలసికట్టుగా పని చేస్తున్నారు. బిసిల ఓట్లపైనా ఆశలు పెట్టుకున్నారు. జగన్ అవినీతి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అక్రమాలపై గురి పెట్టి ప్రచారం చేస్తున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు పర్యాయాలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
2004కు పూర్వం నియోజకవర్గంలో పార్టీకి ఉన్న వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు విశేషంగా కృషి చేస్తున్నారు. దీంతో మూడు పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతున్నది. మొత్తంగా చూస్తే... బిసిలు ఎటువైపు మొగ్గు చూపుతారన్న దాని పైనే అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ మాల (11 వేలు), రెడ్డి (25 వేలు) జగన్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. బిసిలలో అత్యధిక సంఖ్యాకులు తెలుగుదేశం పార్టీ వైపు నిలిచినట్లు భావిస్తున్నారు. కాపులు (17 వేలు) అత్యధికంగా కాంగ్రెస్ పక్షమే అని చెబుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications