చిరంజీవి సెకండ్ రోల్, మూడో పవర్ సెంటర్ అయ్యారా?

ఇక అప్పటి నుండి ఇప్పుడప్పుడే పీఠంపై గురి పెట్టడం సరికాదని భావించి, మొదట పార్టీలో నిలదొక్కుకునేందుకు ఆయన సెకండ్ హీరో పాత్ర పోషిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి వస్తే పార్టీలో మూడో సెంటర్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఎదురు కాలేదు. చిరంజీవి మూడో సెంటర్ అయిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఇటీవలి వరకు ఆయన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వర్గంలో ఉన్నారని, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలో చేరిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. బొత్స, కిరణ్ ఇద్దరూ చిరంజీవి ఇమేజ్ ద్వారా తాము లబ్ధి పొందాలని చూస్తున్నారనే వాదనలు ఉన్నాయి. అధిష్టానం ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో చిరంజీవిని మచ్చిక చేసుకుంటూనే వచ్చే ఎన్నికల సమయంలోనూ ఆయనను అక్కడికే పరిమితం చేసి ఆయన ద్వారా లబ్ది పొందాలని వారిద్దరూ చూస్తున్నారని అంటున్నారు. అలా అయితే ఆయన సెకండ్ రోల్కే పరిమితమయినట్లవుతుందని అంటున్నారు. అయితే చిరంజీవి కూడా తన లక్ష్యం కోసం దగ్గరి దారి వెతుక్కుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేంద్రానికి వెళ్లడం ద్వారా అధిష్టానాన్ని తన వైపుకు మళ్లించుకోవడం, రాష్ట్రంలో అందరి నేతల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి తాను తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశలో అడుగులు వేస్తున్నారని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications