రామోజీరావుని మళ్లీ టార్గెట్ చేసిన జగన్ సాక్షి

అయితే ఆ తర్వాత తమకు చట్టాలు వర్తించవంటూ రామోజీ రావు హైకోర్టులో ఐదు రిట్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది. అంతేకాకుండా అప్పట్లో ఆదాయపన్ను శాఖ 16వ రేంజ్ అదనపు కమిషనర్గా ఉన్న ఆర్.వి.రెడ్డిపై వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేసిందని, అధికారిపై ఆరోపణలు చేసినందుకు హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడిందని తెలిపారు. సదరు అధికారిని ప్రతివాదిగా చేర్చక పోవడాన్ని తప్పు పట్టారు. దీంతో రామోజీ తరఫు న్యాయవాదులు 2008లో ఐదు పిటిషన్లు వెనక్కి తీసుకొని కొత్తవి దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారని పేర్కొంది. తొలి పిటిషన్లు ఉపసంహరించుకొని రామోజీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారని, తమకు అధికారులు పేర్కొన్న చట్టాలు వర్తించవని కోర్టులో వాదించారని, తదుపరి ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరారని, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు దీనిపై స్టే ఇచ్చిందని తెలిపింది. అయితే ఐటి శాఖ మాత్రం స్టే ఎత్తివేతకు అంతగా ప్రయత్నాలు చేయలేదని పేర్కొంది. 2009లో తూతూ మంత్రంగా మాత్రమే స్టే వెకేట్ పిటిషన్ వేసిందని, ఆ తర్వాత రామోజీకి పన్ను విధించదిన అధికారిపై బదలీ వేటు పడిందని పేర్కొంది. కేసు విచారించాల్సిన అవసరాన్ని అధికారులు హైకోర్టుకు చెప్పక పోవడమే కాకుండా, సుప్రీంకు వెళ్లే వెసులుబాటును ఉన్న ఉపయోగించుకోలేదని పేర్కొంది. నాలుగేళ్లుగా రామోజీ కోర్టు స్టేతో నెట్టుకొస్తున్నారని పేర్కోంది.












Click it and Unblock the Notifications