కరచాలనాలు, ఆలింగనాలు అంటూ సాక్షి...
తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వారాదని టిడిపి తీసుకున్న నిర్ణయం తాలుకు ఊరట ప్రతిపక్ష, ప్రధాన ప్రతిపక్షాల్లో కనిపించిందని, బాబు ప్రకటన నేపథ్యంలో బుధవారం శాసనసభ లోపలా, ఆవరణలోనూ కాంగ్రెసు, టిడిపి నేతల కోలాహలం, ఉత్సాహం కనిపించిందని, వారంతా సంతోషకర వాతారవరణంలో, చలోక్తులతో గడిపారని, ముఖాలు చిరునవ్వులతో వెలిగాయని రాసింది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని చందమామ చేతిలో పెట్టారని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దానిని ప్రస్తావించింది. అంతేకాకుండా... గవర్నర్ ప్రసంగం అనంతరం తనకు ఎదురైన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆయనతో కరచాలనం చేశారని, అంతటితో ఊరుకోకుండా ధన్యవాదాలు తెలిపారని రాసింది.
బుధవారం జెసి దివాకర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తమ మేనమామ అని, సహజంగా తల్లి చనిపోతూ తన బిడ్డలను మేనమామ చేతుల్లో పెట్టి వారి ఆలనా పాలనా చూసుకోవాలంటూ అప్పగింతలు పెడుతుందని, అదే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల బాగోగులను చంద్రబాబుకు అప్పగించారని అన్నారు.
అందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఉన్నంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని అన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత జెసి టిడిఎల్పీ కార్యాలయం వద్ద టిడిపి నేతలతో మాట్లాడారు.