కెసీఆర్ కొత్త టార్గెట్?

దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. ను టార్గెట్ చేసుకొని బుధ గురువారాల్లో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు విమర్శల పై కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నేతలు కూడా ఒక్కసారిగా విరుచుకొని పడ్డారు. కెసిఆర్ పై మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. తీవ్రంగా స్పందించారు. ఒక పక్క సోనియాను కరుణామయి అని అంటూనే మరో పక్క వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయన వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తూ పనిలో పనిగా తెలుగు దేశం పార్టీని కూడా వదల కుండా విమర్శలు చేశారు. ఏదో ఒక వ్యూహాన్ని రూపొందించుకోకుండా నోరు విప్పే అలవాటు లేని కెసిఅర్ ఈ సారి ఎలాంటి వ్యూహ రచన చేశారో అని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నారు.
రాష్ట్రం ఒక పక్క వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. రాష్ట్రాన్ని ముంచెత్తిన జలప్రళయం నుంచి ఇక ప్రజలు తేరుకోలేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో కెసిఆర్ వరద ను రాజకీయం చేసి దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. కెసిఆర్ రాజకీయ లక్ష్యం ఏదైనా రాష్ట్రం ప్రస్తుతం ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది. బాధితులను ఆదుకోవడం వారికి సహాయ సహకారాలు అందించి పూర్తిగా వారు కోలుకునేలా చూడాల్సిన నేతలు వరదలను బురద రాజకీయం చేయడం మాత్రం ఎవరు సమర్థించడంలేదు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications