వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక కెసిఆర్ వంతు?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తనలో విలీనం చేసుకున్న కాంగ్రెసు పార్టీ అధిష్టానం తదుపరి ఎజెండా కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని విలీనం చేసుకోవడమేనని అంటున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవ రావు మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఇస్తే తాను అందుకు సిద్ధమేనని కెసిఆర్ పలు మార్లు చెప్పారు. అవసరమైతే తెరాసను విలీనం చేసుకుంటామని కేశవరావు అన్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనంపై ఒక ఛానెల్‌తో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ ఇబ్బంది పడకూడదనే ఇలా చేశామని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవాలని కోర్‌ కమిటీ సమావేశంలో రెండుసార్లు చర్చించామని, పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్‌ముఖర్జీకి కూడా చెప్పామన్నారు. తెరాస విలీనం ఎప్పుడు ఉంటుందని అడిగితే ఎప్పుడో చెప్పలేమని అభిప్రాయపడ్డారు. కెసిఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కేశవ రావు ఆ మాటలన్నారంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లే అనుకోవాలి. చిరంజీవి ద్వారా సీమాంధ్రలో, కెసిఆర్ ద్వారా తెలంగాణలో ముందుకు సాగితే కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో తిరుగు ఉండకపోవచ్చుననే అభిప్రాయం బలంగానే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X