జైలులో నిమ్మగడ్డతో అల్లు అరవింద్ భేటీ

Nimmagadda Prasad - Allu Aravind
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, కేంద్ర మంత్రి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ హైదారాబదులోని చంచల్‌గుడా జైలులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను కలిశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.

నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మంచి మిత్రుడని, అందుకే కలిశానని ఆయన చెప్పారు. ఆయనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్సి చాముండేశ్వరీనాథ్ కూడా నిమ్మగడ్డను కలిశారు. మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవిలకు 80 శాతం వాటా ఉంది. ఇందులో 30 శాతం వాటాను సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది. మాటీవీకి నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నారు.

మా టీవీ వ్యవహారాల్లోనే అల్లు అరవింద్ నిమ్మగడ్డతో కలిసి ఉండవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలు మార్లు సినీ హీరో నాగార్జున కూడా నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు.

ఇదిలావుంటే, చంచల్‌గుడా జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+