కిరణ్ కుమార్ రెడ్డికి ట్విస్టు ఇచ్చిన ఆజాద్?
ముఖ్యమంత్రి తన విశ్రాంతి గదిలోకి వెళ్లిపోయారు. కాగా, ఉదయం నుంచి ముఖ్యమంత్రి ఏపీ భవన్ దాటకపోవటంతో అసలు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ స్థితిలో సాయంత్రం 5 గంటలకు మీడియా ప్రతినిధులు ఆజాద్ను కలిసి రాష్ట్ర కేబినెట్ విస్తరణ గురించి ప్రశ్నించగా.. "ఇంత వరకూ ఎలాంటి వార్తా లేదు'' అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో మళ్లీ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. సాయంత్రం 6.10 గంటలకు సోనియాను కలిసేందుకు సీఎం 10 జన్పథ్కు వెళ్లారు. అప్పటికే అక్కడ ఆజాద్, అహ్మద్ పటేల్ ఉన్నారు. గంటపాటు జరిగిన సమావేశం అనంతరం సీఎం నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు కేబినెట్ విస్తరణ గురించి ప్రశ్నించగా కిరణ్ సమాధానం ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజుల్లో అంతా ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. దీంతో కేబినెట్ విస్తరణకు సంబంధించిన డ్రామాకు తెరపడింది.